ఎమ్మెల్యే మాగంటి మృతిపట్ల సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం

ఎమ్మెల్యే మాగంటి మృతిపట్ల  సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  మాగంటి గోపీనాథ్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి,  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  గోపినాథ్   మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. 

మాగంటి  మరణం పార్టీకి తీరని లోటన్నారు కేసీఆర్.. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు కేసీఆర్.  తనను కాపాడుకునేందుకు వైద్యులు  చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. జూన్ 5న గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ జూన్ 8న ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు.