సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం:సీఎం రేవంత్ రెడ్డి

సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సివిల్ అభ్యర్థులకోసం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. UPSC సివిల్స్ 2023 ప్రిలిమ్స్ లో పాసయిన అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. సింగరేణి ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 

UPSC సివిల్స్ 2023 ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో శనివారం (జూలై 20) సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. UPSC సివిల్స్ 2023 ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఏండ్ల తరబడి ఉద్యోగాలను ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి వారికోసం చేయూతగా అభ్యర్థులకు రూ.ల క్ష ఆర్థిక సాయం స్కీం ప్రారంభించామన్నారు.అభ్యర్థులంతా ఫుల్ ఫోకస్ గా చదివి సివిల్స్ సాధించాలన్నారు.  అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకొని గ్రూప్ 2 వాయిదా వేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

నిరుద్యోగుల సమస్యల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతో మంది పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది.. అమరుల పునాదుల మీదనే రాష్ట్రం ఏర్పడింది.. గత సర్కార్ నిరుద్యోగుల్ని ఆగమాగం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగాల భర్తీ కాలేదు.  90రోజుల్లో 30 వేల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు.