తెలంగాణ ప్రజలను అవమానించేలా రేవంత్ భాష : జోగు రామన్న

తెలంగాణ ప్రజలను అవమానించేలా రేవంత్ భాష :  జోగు రామన్న

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉందని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే తీరు ఇది కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌లో ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌‌‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు.

వందలమంది ఆదివాసీలను కాంగ్రెస్ పొట్టనబెట్టుకుందన్నారు. సమైక్య పాలనలో ఇంద్రవెల్లి ఘటన జరిగింది కాబట్టి క్షమాపణ చెప్తున్నానని రేవంత్ అన్నారని గుర్తుచేశారు. అమరవీరుల స్తూపాన్ని కూల్చింది కూడా ఆ పార్టీయేనని, ఇప్పుడున్న స్థూపం ప్రజా సంఘాలు నిర్మించుకున్నదని, దానిని తాకే హక్కు రేవంత్​కు లేదన్నారు. కాంగ్రెస్​ పాలనలో గద్దర్‌‌‌‌‌‌‌‌ను కూడా ఆ స్థూపం వద్దకు వెళ్లనివ్వలేదన్నారు.