పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది: సీఎం రేవంత్

పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది: సీఎం రేవంత్

దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి పీవీ నరసింహరావు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో సంజీవయ్య పార్క్ లోని జ్ఞానభూమి ఘాట్ దగ్గర  పీవీ 19వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. పీవీ ఘాట్ దగ్గర సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు నివాళి అర్పించారు.   పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు సీఎం రేవంత్. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. పీవీ పేదలకు భూమిని అందుబాటులోకి తీసుకొచ్చారని..ఆయన ప్రజల మధ్య లేకపోయినా వారి సంస్కరణలు ఆచరణీయమన్నారు.

పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  వీళ్లిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారన్నారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. .