
హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.