స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.2వేల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్ రెడ్డి

స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.2వేల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యా, నైపుణ్యాభివృద్ధి అంశంపై జరిగిన  సమావేశానికి చీఫ్ గెస్టుగా రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..  రూ.2000 కోట్లలతో 64ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా డెవలప్ చేయబోతున్నట్లు చెప్పారు.  స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.  స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామన్నారు.

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి..ఇపుడెవరూ  రాజకీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు రేవంత్.  ఈ ప్రభుత్వం అందరిదీ..మీరు కోరుకుంటేనే ఇక్కడికి వచ్చామని.. రాష్ట్రాభివృద్ధికి అందరి సహకాం అవసరమన్నారు.  ప్రపంచ దేశాలతో  తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానమని.. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం.  

రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు రేవంత్.  అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు.  గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని... ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.