ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి

ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర బయల్దేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర ముంబైకి చేరుకుంది. మార్చి 17వ తేదీ ఆదివారం ముంబైలో భారత్ న్యాయ్ యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. 

ఈ సభలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ముఖ్య నాయకులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. దీంతో యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లనున్నారు. ఆయనతోపాటు పలువురు కీలక నేతలు కూడా వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, 2024  జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ..  మణిపూర్ లో భారత్ న్యాయ యాత్ర  ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Also read : బీఆర్ఎస్ కు రాజీనామా.. బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్