వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. 2024 మార్చి 17వ తేదీ ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యలయంలో స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కాషాయం పార్టీ కండువా కప్పుకున్నారు. కమలం పార్టీ నుంచి వరంగల్ ఎంపీ సీటు ఆశిస్తున్న రమేశ్.. నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇదివరకే ఆరూరి బీజేపీలో చేరాల్సి ఉండగా, బీఆర్ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు.
కేసీఆర్ ఇంట్లో జరిగిన వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని, గెలిపించుకుంటామని కేసీఆర్ కోరగా, ఆరూరి తిరస్కరించారు. మళ్లీ బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్లారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా నేతలు బిజీగా ఉండటంతో ఆయన చేరిక ఆలస్యమైంది. ఈ క్రమంలో శనివారం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆరూరి ఆదివారం బీజేపీలో చేరారు.