మేడారంలో సీఎం రేవంత్.. ఏర్పాట్ల పరిశీలన తర్వాత నడుచుంటూ హరిత హోటల్కు..

మేడారంలో సీఎం రేవంత్.. ఏర్పాట్ల పరిశీలన తర్వాత నడుచుంటూ హరిత హోటల్కు..

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం జాతార ఏర్పాట్లను సీఎం రేవంత్ పరిశీలించారు. ఆదివారం (జనవరి 18) సాయంత్రం మేడారం వెళ్లిన సీఎం.. బస్సులో మంత్రులతో కలిసి వెళ్లి ఏర్పాట్లను గురించి తెలుసుకున్నారు. 

మేడారంలో జాతర ఏర్పాట్లకు సంబంధించి దగ్గరుండి వివరాలు తెలుసుకున్నారు సీఎం. పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల పనితీరు పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు, AI టెక్నాలజీ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు పోలీస్ ఉన్నతాధికారులు.

ఆ తర్వాత మంత్రులతో కలిసి బస్సులో జంపన్న వాగు పరిశీలనకు వెళ్లారు సీఎం రేవంత్ . మేడారం జంపన్న వాగు సర్కిల్ వరకు జాతర ఏర్పాట్లను పరిశీలను పరిశీలించారు. మేడారం వై జంక్షన్లో మంత్రులతో కలిసి ఫోటోలు దిగారు.  వై జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా ఆదివాసి సంస్కృతి.. పల్లె వాతావరణన్ని ప్రతిబింభించేలా విగ్రహాలు, వాటర్ ఫౌంటెన్ అభివృద్ధి చేసింది ప్రభుత్వం. కొత్తగా అభివృద్ధి చేసిన వై జంక్షన్ ప్రాంత వివరాలు అడిగి తెలుసుకున్నారు.