
సైబర్ క్రైం ను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ తెలిపారు. నేరాలు చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదలిపెట్టమన్నారు. డ్రగ్స్ నియంత్రణకు చిరంజీవి ముందుకు వచ్చి.. మంచి అవగాహన కల్పించారన్నారు. డ్రగ్స్ నియంత్రణకు సినిమా వారు ముందుకు రావాలన్నారు. గతప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగిపోయిందన్నారు. అ రోజుల్లో సైబర్ క్రైం పెద్ద సమస్యగా మారిందన్నారు. డ్రగ్స్ కు బానిసలయితే కుటుంబాలు నాశనమవుతాయని సీఎం రేవంత్ అన్నారు. సినిమా టికెట్లె పెంచాలనే వారు డ్రగ్స కట్టడికి వీడియోలు చూపించాలన్నారు, సమర్దవంతంగా పనిచేసిన అధికారులు ప్రమోషన్ కల్పిస్తామన్నారు.
60 ఏళ్ళ పోరు వందల మంది విద్యార్థుల పోరాటంతో ఏర్పడిన తెలంగాణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన విచ్చలవిడిగా డ్రగ్స్ రవాణా జరుగుతుందన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీస్ వ్యవస్థ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ వివిధ శాఖలను ఏర్పాటు చేసుకుందన్నారు. నేర నియంత్రణలో అధికారుల్లో ఆత్మస్తయిర్యం కలిగించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదురుకుంటున్న క్రైమ్ లో..సైబర్ క్రైమ్ చాలా కీలకం గా ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఈఏడాది ఇప్పటి వరకు 1892 కేసులు నమోదయ్యాయన్నారు. రూ. 31 కోట్లు రికవరీ చేసి సైబర్ పోలీసులు బాదితులకు అందించారు..
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై అధికారుల్లో అవగాహన కల్గించాలి..పట్టణం, పల్లె అనే తేడా లేకుండా డ్రగ్స్ విస్తరణ జరుగుతోంది..డ్రగ్స్ వినియోగం ను శాశ్వతంగా అరికట్టాల్సిన అవసరం ఉంది..సైబర్ క్రైమ్, డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్న అధికారులకు రివార్డు తో పాటు.. పదవోన్నతి కల్పించేందుకు కృషి చేస్తాం..హీరో చిరంజీవి డ్రగ్స్ నివారణకు ఒక వీడియో రిలీజ్ చేసి ప్రభుత్వానికి ఇచ్చినందుకు సీఎం రేవంత్ కృతఙ్ఞతలు తెలిపారు.
సినిమా వాళ్ళు టికెట్ రేట్లపై పెట్టిన శ్రద్ద సామజిక బాధ్యత పై ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరు టికెట్ రేట్ పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వచ్చినా..ఆ సినిమా నటులతో డ్రగ్స్ నివారణ, సైబర్ నేర నివారణ పై అవగాహన కల్గిస్తూ వీడియో చేసి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. 1:30 నిమిషాలు, లేదా 2 నిమిషాల వీడియో ను అదే సినిమాలోని నటులతో చేసి ఇస్తేనే టికెట్ రేట్లపై వెసులు బాటు ఉంటుంది..ప్రతి థియేటర్ లో సినిమా ప్రారంబానికి ముందు సైబర్ క్రైమ్ నివారణ, డ్రగ్స్ నివారణ కు సంబంధించి కచ్చితంగా వీడియోలు ప్లే చేయాలి
డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం సమర్థవంతంగా పని చేసేవారిని ప్రోత్సహించాలని సూచించారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డ్రగ్స్ అనే పదం వింటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు.