చికెన్ బిర్యానీలో పురుగు  

చికెన్ బిర్యానీలో పురుగు  

యాదాద్రి భువనగిరి జిల్లా: బిర్యానీలో పురుగులు వచ్చాయని హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కస్టమర్లు. ఈ సంఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి హైవే పక్కనున్న సురిచి హోటల్ లో చోటు చేసుకుంది.  8 మంది ఫ్రెండ్స్ తో కలిసి హోటల్ కి వచ్చామని..  వెజ్ బిర్యానీ, చికెన్ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేశామని తెలిపారు వినియోగదారులు. అయితే చికెన్ బిర్యానీలో పురుగును గమనించామన్నారు. ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకుల దృష్టికి  తీసుకువస్తే,  సర్వింగ్ చేసేటప్పుడు పై నుంచి పడి ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధిత వినియోగదారులు ఆరోపించారు. హోటల్ కిచెన్ రూమ్ లోపల పరిశీలించామని పరిశుభ్రంగా లేదన్నారు. చికెన్ బిర్యానిలోని రైస్ నే  వెజ్ బిర్యానీకి వినియోగిస్తున్నట్లు గ్రహించామన్న వినియోగదారులు.. హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమైన హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.