
తన ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడకుండా ఆపడానికి ప్రముఖ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్లోని తన ఆఫీసును తాత్కాలికంగా మూసివేసింది. ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులను ఆదేశించింది. హైదరాబాద్లోని రహేజా మైండ్స్పేస్ ఐటీ పార్క్లో ఈ కంపెనీ ఆఫీసు ఉంది. ఇదే బిల్డింగ్లోని ఒక మహిళా ఉద్యోగికి కరోనా వైరస్ సోకడం తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా తమ ఆఫీసునూ మూసేస్తున్నట్టు మేనేజ్మెంట్ ఉద్యోగులకు ఈ–మెయిల్ పంపింది.