కరోనా ఎఫెక్ట్‌‌..కాగ్నిజెంట్‌‌ బంద్‌‌

కరోనా ఎఫెక్ట్‌‌..కాగ్నిజెంట్‌‌ బంద్‌‌

తన ఉద్యోగులు కరోనా వైరస్‌‌ బారిన పడకుండా ఆపడానికి ప్రముఖ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్‌‌ హైదరాబాద్‌‌లోని తన ఆఫీసును తాత్కాలికంగా మూసివేసింది. ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులను ఆదేశించింది. హైదరాబాద్‌‌లోని రహేజా మైండ్‌‌స్పేస్‌‌ ఐటీ పార్క్‌‌లో ఈ కంపెనీ ఆఫీసు ఉంది. ఇదే బిల్డింగ్‌‌లోని ఒక మహిళా ఉద్యోగికి కరోనా వైరస్‌‌ సోకడం తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా తమ ఆఫీసునూ మూసేస్తున్నట్టు మేనేజ్‌‌మెంట్‌‌ ఉద్యోగులకు ఈ–మెయిల్‌‌ పంపింది.