ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు లేకుండా చూడాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు లేకుండా చూడాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్/ దంతాలపల్లి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించే సమయానికి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు.  మంగళవారం మండల ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులుగా మండల స్పెషల్​ఆఫీసర్లు ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, న్యూట్రీషన్​ అమలుపై ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

కలెక్టర్​ ఆదేశాలతో జిల్లాలోని ఆయా మండలాల్లో అధికారులు ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్ల తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్​ప్రభుత్వ పాఠశాలలో జడ్పీ సీఈవో పురుషోత్తమ్, నర్సింహులపేట హాస్టల్​లో మండల ప్రత్యేకాధికారి ప్రేమ్​కుమార్, దంతాలపల్లి మండల కేంద్రం, పెద్దముప్పారం ఎస్టీ హాస్టల్స్, కుమ్మరికుంట్ల, పెద్దముప్పారం ప్రభుత్వ స్కూల్స్​లో వసతులను ప్రత్యేకాధికారి వీరన్న పరిశీలించారు.