
మహబూబాబాద్/ దంతాలపల్లి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించే సమయానికి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం మండల ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులుగా మండల స్పెషల్ఆఫీసర్లు ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, న్యూట్రీషన్ అమలుపై ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని ఆయా మండలాల్లో అధికారులు ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్ల తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్ప్రభుత్వ పాఠశాలలో జడ్పీ సీఈవో పురుషోత్తమ్, నర్సింహులపేట హాస్టల్లో మండల ప్రత్యేకాధికారి ప్రేమ్కుమార్, దంతాలపల్లి మండల కేంద్రం, పెద్దముప్పారం ఎస్టీ హాస్టల్స్, కుమ్మరికుంట్ల, పెద్దముప్పారం ప్రభుత్వ స్కూల్స్లో వసతులను ప్రత్యేకాధికారి వీరన్న పరిశీలించారు.