
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ కోరారు. శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా జిల్లాలో ఎంపిక కాబడిన పాఠశాలల్లో, విద్యార్థులకు అభ్యాస నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిసరాల శుభ్రత, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
మధ్యాహ్న భోజనం వేడిగా విద్యార్థులకు వడ్డించాలన్నారు. జిల్లాలో వయోజన విద్య పై ప్రత్యేక దృష్టి పెడుతూ అక్షరాస్యత శాతం పెంచాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లను పెంచాలని కోరారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ లెనిన్ వత్సల్టొప్పొ, డీఈవో ఏ.రవీందర్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మధార్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు