వడ్ల అన్‎లోడ్ లేటెందుకు చేస్తున్నరు.. మిల్లర్లపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ 

వడ్ల అన్‎లోడ్ లేటెందుకు చేస్తున్నరు.. మిల్లర్లపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ 

యాదాద్రి, వెలుగు: మిల్లులకు వడ్ల లారీలు వచ్చినా అన్​లోడ్​లేటు ఎందుకు చేస్తున్నారని యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​జయంతి సీరియస్​అయ్యారు. బుధవారం అడిషనల్​ కలెక్టర్​ వెంకారెడ్డితో కలిసి జిల్లాలోని వలిగొండలోని రైస్​ మిల్లును ఆయన తనిఖీ చేశారు. మిల్లులో వడ్ల స్టాక్​ ఎంతుందని ఆరా తీశారు. రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయని, అన్​లోడ్​ చేయడానికి ఎంత టైమ్​ పడుతోందని ప్రశ్నించారు.

 వచ్చిన లారీలను వచ్చినట్టే ఎప్పటికప్పుడు ఎందుకు అన్​లోడ్​ చేయడం లేదని ప్రశ్నించారు. హమాలీల ప్రాబ్లం ఉందని చెప్పడంతో హమాలీలను ఎక్కువగా తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్కలారీ కూడా మిల్లులో ఆగకూడదని సూచించారు. అనంతరం బ్యాగుల్లోని సీఎంఆర్​ రైస్​ను కలెక్టర్​ పరిశీలించారు. డీసీఎస్​వో రోజారాణి, మండల ఆఫీసర్లు ఉన్నారు.