ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : రాజీవ్ గాంధీ హన్మంతు

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : రాజీవ్ గాంధీ హన్మంతు

నిజామాబాద్ సిటీ, వెలుగు: పెండింగ్ లో ఉన్న ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 88 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు కలెక్టర్ తో పాటు అడిషనల్​ కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, డీపీవో చక్రవర్తి తరుణ్ కుమార్ లకు తమ సమస్యలు విన్నవించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేస్తూ, ప్రజావాణి సైట్ లో అప్​లోడ్​చేయాలని కలెక్టర్​సూచించారు.

కామారెడ్డి టౌన్: కామారెడ్డి కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణికి 65 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో భూముల సమస్యలకు సంబంధించినవి 27 అర్జీలు ఉన్నాయి. అడిషనల్​కలెక్టర్​చంద్రమోహన్, డీఆర్డీవో పద్మజారాణి, జడ్పీ సీఈవో చందర్, కలెక్టరేట్​ఏవో మసూర్​అహ్మద్​ఫిర్యాదులు స్వీకరించారు.