ఓటర్​లిస్ట్​లో ఏ ఒక్కరి పేరు మిస్​ అవ్వొద్దు : ​జితేశ్​​వీ పాటిల్

ఓటర్​లిస్ట్​లో ఏ ఒక్కరి పేరు మిస్​ అవ్వొద్దు : ​జితేశ్​​వీ పాటిల్

కామారెడ్డి, వెలుగు: ఓటర్​ లిస్ట్​లో ఏ ఒక్కరి పేరు మిస్​ అవ్వొద్దని కలెక్టర్ ​జితేశ్​​వీ పాటిల్​ పేర్కొన్నారు. సోమవారం ఓటర్​లిస్ట్​లో మార్పులు, చేర్పులపై స్టేట్​ఎలక్షన్​ఆఫీసర్​ వికాస్​రాజ్​ కలెక్టర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. అనంతరం కామారెడ్డి కలెక్టర్ ఆఫీసర్లతో మాట్లాడుతూ.. డిగ్రీ కాలేజీలో అర్హత ఉన్న  స్టూడెంట్స్​ను  ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.  ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు వచ్చే అప్లికేషన్లను స్వీకరించాలన్నారు. అడిషనల్​కలెక్టర్లు మనూచౌదరి, చంద్రమోహన్, ఆర్డీవో రంగనాథ్, ఎలక్షన్​సెల్​ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి: ప్రాచీన కట్టడాలను పరిరక్షించి, మన చరిత్ర ఆనవాళ్లను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతో ఉందని కలెక్టర్ ​జితేశ్​వీ పాటిల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి లోని పురాతన బావిని సోమవారం కలెక్టర్​పరిశీలించారు. బావిని పునరుద్ధరించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల భిక్కనూరులోని సిద్ధిరామేశ్వర ఆలయంలో ఉన్న  కోనేరును దాతల సహకారంతో బాగుచేయించినట్లు గుర్తు చేశారు.