విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : పమేలా సత్పతి

 విద్యార్థులకు నాణ్యమైన  భోజనం అందించాలి : పమేలా సత్పతి

 

  • కలెక్టర్ పమేలా సత్పతి

 రామడుగు, వెలుగు: ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్​జిల్లా కేజీబీవీలు, బాలికల రెసిడెన్షియల్ హాస్టళ్లలో వంట చేసే 90 మంది సిబ్బందికి రామడుగు మండలం వెదిర కేజీబీవీలో మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో భాగంగా వంట సిబ్బంది తయారుచేసిన భోజనాన్ని రుచి చూశారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వంటగది పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రమైన నీరు, నాణ్యమైన కూరగాయలను వాడాలన్నారు. కేజీబీవీల్లోని ఖాళీ స్థలాల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి రాజేశ్వరి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, కేజీబీవీ ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు. 

ముగిసిన టెక్నికల్ టీచర్స్ కోర్సు

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే చదువుతోపాటు నైపుణ్యం పెంచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం సిటీలోని ధన్గర్ వాడి గవర్నమెంట్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  విద్యాశాఖ ఆధ్వర్యంలో 42 రోజులుగా  టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో 769 మంది టీచర్లకు నిర్వహిస్తున్న టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్ క్రాఫ్ట్, డ్రెస్ మెటీరియల్, పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించి, అభినందించారు. 

అనంతరం కోర్సులో ప్రతిభ చూపిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు ఇటీవల మిజోరం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన భూక్యా యశ్వంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో ఆంజనేయులు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, గర్ల్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ కృపారాణి, సూపరింటెండెంట్ నరసింహస్వామి, ఏసీజీ సంధ్యారాణి, హెచ్ఎం ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.