ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోండి : ప్రావీణ్య

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోండి : ప్రావీణ్య

ధర్మసాగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి పరిధిలోని సయ్యద్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ఖర్చయింది, సామగ్రి ఎక్కడి నుంచి  తెచ్చుకుంటున్నారని లబ్ధిదారులను అడిగారు. అనంతరం ముప్పారంలో నిర్వహించిన భూభారతి సదస్సుకు హాజరయ్యారు. దరఖాస్తులను పరిశీలించి, భూ సమస్యలపై ఆరా తీశారు. 17వ నంబర్ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఎన్ని క్వింటాళ్ల బియ్యం వచ్చాయి, ఎంతమంది లబ్ధిదారులున్నారని డీలర్​రమను అడిగి తెలుసుకున్నారు.  

చదువుతోపాటు ఆటల్లో రాణించాలి

హనుమకొండ సిటీ, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జేఎన్​ఎస్ లో డీవైఎస్​వో అశోక్ కుమార్​ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా సమర్ క్యాంప్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేఎన్ఎస్ స్టేడియాన్ని  అప్ గ్రేడ్  చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజీజ్ ఖాన్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తదితరులున్నారు.