వంద శాతం ఓటింగ్​లక్ష్యం : కలెక్టర్​ రాహుల్​రాజ్​

వంద శాతం ఓటింగ్​లక్ష్యం : కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: జిల్లాలో వందశాతం ఓటింగ్ ​లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్​ రాజ్ అధికారులకు సూచించారు. సోమవారం ​ఆయన మెదక్ ​కలెక్టరేట్​లో ఓటరు చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ​మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటింగ్​లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కళాకారులు  ఆటపాటలతో ప్రజలకు చైతన్యం కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, డీపీవో యాదయ్య, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, డీఎస్​వో రాజిరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్​హరిదీప్​సింగ్, కళాకారులు పాల్గొన్నారు.