
జనగామ అర్బన్, వెలుగు: భూ సమస్యల అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూభారతి, జాతీయ కుటుంబ లబ్ధి పథకం, సన్న బియ్యం, బీఎల్వోలకు శిక్షణ తదితర అంశాలపై అడిషనల్ కలెక్టర్రోహిత్ సింగ్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
సర్వే నంబర్ మిస్ మ్యాచ్ అయితే నోటీస్ ఇవ్వాలని చెప్పారు. సన్న బియ్యం పంపిణీలో వేగం పెంచాలని, బీఎల్ వోలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంతు నాయక్, ఆర్డీవోలు గోపీరామ్, డీఎస్.వెంకన్న, సీఎస్డీఎం హతిరామ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
టీ స్టాల్ ప్రారంభించిన కలెక్టర్
బచ్చన్నపేట, వెలుగు: మహిళలను ఆర్థికంగా బోలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. పోచన్నపేటకు చెందిన శ్రీచైతన్య పొదుపు సంఘం సభ్యురాలు శ్రీపతి రేణుకు మంజూరైన టీస్టాల్(వనిత టీ స్టాల్)ను తహసీల్దార్ ఆఫీస్ఆవరణలో ఏర్పాటు చేశారు. దీన్ని గురువారం అడిషనల్కలెక్టర్పింకేశ్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉపయోకరంగా ఉండే యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడికి వచ్చినవారికి కలెక్టర్ సొంత ఖర్చుతో టీ అందజేశారు. డీఆర్డీవో వసంత, అడిషనల్ డీఆర్డీవో నూరొద్దీన్, మండల స్పెషల్ ఆఫీసర్రామారావు నాయక్, ఇన్చార్జి తహసీల్దార్ఫణికిశోర్, ఎంపీడీవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.