భూ సమస్యల అర్జీలను పరిష్కరించండి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

భూ సమస్యల అర్జీలను పరిష్కరించండి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: భూ సమస్యల అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్​ రిజ్వాన్ ​బాషా షేక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో భూభారతి,  జాతీయ కుటుంబ లబ్ధి పథకం, సన్న బియ్యం, బీఎల్​వోలకు శిక్షణ తదితర అంశాలపై అడిషనల్​ కలెక్టర్​రోహిత్ సింగ్​తో కలిసి సమీక్ష నిర్వహించారు.

సర్వే నంబర్​ మిస్​ మ్యాచ్ అయితే నోటీస్​ ఇవ్వాలని చెప్పారు. సన్న బియ్యం పంపిణీలో వేగం పెంచాలని, బీఎల్ వోలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంతు నాయక్, ఆర్డీవోలు గోపీరామ్, డీఎస్.వెంకన్న, సీఎస్​డీఎం హతిరామ్​, తహసీల్దార్లు పాల్గొన్నారు. 

టీ స్టాల్​ ప్రారంభించిన కలెక్టర్

బచ్చన్నపేట, వెలుగు: మహిళలను ఆర్థికంగా బోలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ అన్నారు. పోచన్నపేటకు చెందిన శ్రీచైతన్య పొదుపు సంఘం సభ్యురాలు శ్రీపతి రేణుకు మంజూరైన టీస్టాల్(వనిత టీ స్టాల్)​ను తహసీల్దార్ ఆఫీస్​ఆవరణలో ఏర్పాటు చేశారు. దీన్ని గురువారం అడిషనల్​కలెక్టర్​పింకేశ్ కుమార్​తో కలిసి కలెక్టర్ ​ప్రారంభించారు.

 ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉపయోకరంగా ఉండే యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడికి వచ్చినవారికి కలెక్టర్​ సొంత ఖర్చుతో టీ అందజేశారు. డీఆర్డీవో వసంత, అడిషనల్ డీఆర్డీవో నూరొద్దీన్, మండల స్పెషల్​ ఆఫీసర్​రామారావు నాయక్​, ఇన్​చార్జి తహసీల్దార్​ఫణికిశోర్, ఎంపీడీవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.