
రఘునాథపల్లి/ ఎల్కతుర్తి, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికే భూభారతి కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బుధవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు. తహసీల్దార్ మోసిన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు.
హెల్ప్ డెస్క్ ను సందర్శించి దరఖాస్తుల స్వీకరణ వేగవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోసిన్ రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ జగత్సింగ్, అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 81 దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ తెలిపారు.