భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం :కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​

భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం :కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​

రఘునాథపల్లి/ ఎల్కతుర్తి, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికే భూభారతి కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ అన్నారు. బుధవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు. తహసీల్దార్​ మోసిన్​ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు.

హెల్ప్ డెస్క్ ను సందర్శించి దరఖాస్తుల స్వీకరణ వేగవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో   తహసీల్దార్ మోసిన్ రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్​లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్​ జగత్​సింగ్, అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 81 దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్​ తెలిపారు.​