పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ స్నేహా శబరీష్

పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ స్నేహా శబరీష్

భీమదేవరపల్లి, వెలుగు: ఈ నెలలో 26లోగా పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్​ స్నేహా శబరీష్​అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​ రైతు వేదికలో జరిగిన రైతు భరోసా సంబురాల్లో భాగంగా ముఖ్యమంత్రితో జరిగిన ముఖాముఖిలోని వీడియోకాన్ఫరెన్స్​ను వీక్షించారు. అనంతరం వంగరలో పీవీ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. 

ఓపెన్​ థియేటర్, ఆడిటోరియం, మ్యూజియం తదితర పనులను స్పీడప్​చేయాలని ఆదేశించారు. అంతకుముందు ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్​ సొసైటీ లిమిటెడ్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాంను కలెక్టర్​ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్​సింగ్​తో కలిసి పరిశీలించారు.