
భీమదేవరపల్లి, వెలుగు: ఈ నెలలో 26లోగా పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహా శబరీష్అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ రైతు వేదికలో జరిగిన రైతు భరోసా సంబురాల్లో భాగంగా ముఖ్యమంత్రితో జరిగిన ముఖాముఖిలోని వీడియోకాన్ఫరెన్స్ను వీక్షించారు. అనంతరం వంగరలో పీవీ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు.
ఓపెన్ థియేటర్, ఆడిటోరియం, మ్యూజియం తదితర పనులను స్పీడప్చేయాలని ఆదేశించారు. అంతకుముందు ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాంను కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్సింగ్తో కలిసి పరిశీలించారు.