పోలింగ్​ స్టేషన్లలో సౌలతులు కల్పించాలి : తేజస్ నంద లాల్ పవార్

పోలింగ్​ స్టేషన్లలో సౌలతులు కల్పించాలి : తేజస్ నంద లాల్ పవార్

వనపర్తి, వెలుగు: జిల్లాలోని ప్రతి పోలింగ్  కేంద్రంలో సౌలతులు కల్పించాలని కలెక్టర్  తేజస్ నంద లాల్ పవార్  సూచించారు. శుక్రవారం వనపర్తి మున్సిపాలిటీ, మండలంలోని పోలింగ్  కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సౌలతులు పరిశీలించారు. పట్టణంలోని ఉర్దూ మీడియం కాలేజీలో రెండు పోలింగ్ స్టేషన్లు, కొత్త లైబ్రరీ పోలింగ్ స్టేషన్  పరిశీలించారు.

అనంతరం పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామంలో రెండు పోలింగ్ స్టేషన్లు, పామిరెడ్డిపల్లి గ్రామంలో నాలుగు పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన కలెక్టర్  పామిరెడ్డిపల్లిలో మరుగుదొడ్లు  సరిగా లేకపోవడంతో వెంటనే రిపేర్లు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో విద్యుత్, మరుగుదొడ్లు, మంచినీరు, లైటింగ్, దివ్యాంగులకు ర్యాంప్  తప్పనిసరిగా ఉండాలన్నారు.