జీఓ 59ను సద్వినియోగం చేస్కోండి : ఖమ్మం కలెక్టర్​వీపీ గౌతమ్‌

జీఓ 59ను సద్వినియోగం చేస్కోండి : ఖమ్మం కలెక్టర్​వీపీ గౌతమ్‌

ఖమ్మం టౌన్, వెలుగు: జీఓ59ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సూచించారు. మంగళవారం ఖమ్మంలోని 55వ డివిజన్ వేణుగోపాల్ నగర్, -1, 4వ డివిజన్ యూపీహెచ్ కాలనీ, వేణుగోపాల్ నగర్-2లో పర్యటించారు. జీఓ 59పై అవగాహన కల్పించారు. 

స్థలాల క్రమబద్ధీకరణతో కలిగే ప్రయోజనాలను వివరించారు. పట్టాలు ఇచ్చేందుకు కనీస ధర చెల్లిస్తే చాలన్నారు. 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్​లోనూ పర్యటించారు. అనంతరం కలెక్టరేట్​నుంచి వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించి అధికారులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల పురోగతి, బీసీ సంక్షేమ రుణాలు, నీటి సరఫరా, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, హరితహారం కార్యక్రమాలపై 
సమీక్షించారు.