విత్తనాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు : దివాకర టీఎస్

విత్తనాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు : దివాకర టీఎస్
  • కలెక్టర్ దివాకర టీఎస్

ములుగు, వెలుగు: నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరిపడా దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ దివాకర టీఎస్ అదేశించారు. వాటిని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని లక్ష్మి ఫర్టిలైజర్స్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఏవో పరమేశ్వర్ తదితరులున్నారు.

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి 

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. గురువారం ములుగు మండలంలోని ఇంచర్ల రైతు వైదికలో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు.

 ఇప్పటికే వెంకటాపూర్ మండలంలో సదస్సులు పూర్తయ్యాయని, మిగతా 9 మండలాల్లో ఈ నెల 20వ తేదీలోగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తహసీల్దార్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి కాపాడాలి

భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటి కాపాడాలని కలెక్టర్ దివాకర టీఎస్ ప్రజలకు సూచించారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ములుగు మండలంలోని ఇంచర్ల ఏకో పార్క్ లో డీఎఫ్ వో రాహూల్ కిషన్ జాదవ్ తో కలిసి మొక్కలు నాటారు. ఎఫ్ఆర్ వో శంకర్, డిప్యూటీ ఎఫ్ఆర్ వో శోభన్, ఎఫ్ఎస్ వో రవీందర్ తదితరులున్నారు.

భూ సమస్యలకు పరిష్కారం

మహబూబాబాద్, వెలుగు: భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం చిన్న గూడూరు మండలం జయ్యారం, కురవి మండలం నేరేడ, సుదనపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. భూ సమస్యలున్నవారు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. చిన్నగూడూరు  తహసీల్దార్ ​మహబూబ్​అలీ  తదితరులున్నారు.