- అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి
- హైకోర్టు సీనియర్ లాయర్ రాపోలు భాస్కర్ డిమాండ్
ఖైరతాబాద్,వెలుగు: జంట నగరాల్లో వాణిజ్యప్రకటనల టెండర్లలో బల్దియా అధికారులు యాడ్ఏజెన్సీలతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని హైకోర్టు సీనియర్ లాయర్ రాపోలు భాస్కర్ఆరోపించారు. బడా ఏజెన్సీలు ఇచ్చే కమీషన్లతో అధికారులు వారికే యాడ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారని, దీంతో చిన్న ఏజెన్సీలు మూత పడుతున్నాయని పేర్కొన్నారు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడుతున్న బల్దియా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో రిట్పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఏసీబీ డైరెక్టర్కు కూడా ఫిర్యాదు చేశానని ఆ కాపీని చూపారు. ప్రభుత్వ జీవో నం. 68 ప్రకారం 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే రోజుకు రూ. లక్ష ఫైన్ వేయాలని చెప్పారు. యాడ్ ఏజెన్సీలు ప్రకటనలు వేసేందుకు పొందిన కాలపరిమితి ముగిసినా ఎలాంటి చర్యలుతీసుకోకుండా కంటిన్యూ చేస్తున్నారని ఆరోపించారు.
నిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా రూల్స్కు విరుద్ధంగా ప్రకటన బోర్డులను ఎత్తు పెంచితే గాలులు వీచినప్పుడు బోర్డులు కింద పడి అటుగా వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెప్పారు. ప్రకటనల ద్వారా బల్దియాకు ఏడాదికి రూ. 145 కోట్ల ఆదాయం వస్తుందని, యాడ్ఏజెన్సీ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కవుతుండగా సంస్థ ఆదాయం కోల్పోతుందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో శోభారెడ్డి పాల్గొని మాట్లాడారు.