హైదరాబాద్, వెలుగు: ‘సర్’ పై రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల పోలింగ్ స్టేషన్లకు కమిటీలను నియమించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పీఏసీ సమావేశం అనంతరం ఆయన గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. ప్రతి బూత్ ను ఒక యూనిట్ గా తీసుకొని, స్పెషల్ఇంటెన్సివ్రివిజన్ను పరిశీలిస్తామన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్ఏలకు రాబోయే 10 రోజుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
