
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బొజ్జనాయక్తండాలో బడి మూతపడి 10 ఏండ్లు అయ్యింది. పున:ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు మాధన్నపేట, బాంజీపేటకు వెళ్లి చదువుకుంటున్నారు. దూరం వెళ్లి చదువుకోవడం ఇబ్బందిగా మారిందని తండావాసులు చెబుతున్నారు. బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్ఉద్యోగులు బీఎన్తండా వారియర్స్గా ఏర్పడి గ్రామస్తులతో కలిసి పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు చిన్నచిన్న మరమ్మతులు చేయించి రీఓపెన్ చేసి, ఉపాధ్యాయులను నియమించాలని అధికారులను కోరారు.
వారియర్స్ తరఫున సహకారం అందిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో బీఎన్తండా వారియర్స్ గౌరవ సలహాదారుడు ఎన్.నాదం, ఉపాధ్యక్షుడు అజ్మీర సూరయ్య, అసోసియేట్ అధ్యక్షుడు భూక్య వీరన్న, యూత్ అధ్యక్షులు భూక్య రాజు, రాకేష్, గ్రామస్తులు అజ్మీర శివరాం, భూక్య సారయ్య, భూక్య బద్రు, భూక్య వీరన్న (గోడి), అజ్మీర నందు, అజ్మీర మంగు, డప్పు బద్రు, కిషన్, అజ్మీర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.