హుజురాబాద్ లో BJP,TRS కు మాత్రమే పోటీ

హుజురాబాద్ లో BJP,TRS కు మాత్రమే పోటీ

హుజురాబాద్ ఎన్నికల్లో అధికార TRS పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుడిని తయారు చేసుకోలేకపోయిందని విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఈఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం కట్టాలో ప్రజలు ఒక్క సారి ఆలోచించుకోవాలన్నారు. గతంలో దుబ్బాకలో ఎంత నిష్టగా బీజేపీ పని చేసిందో.. అదే నియమనిష్టలతో హుజురాబాద్ లో కూడా పని చేస్తామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు, వందమంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. పాలపొంగు, నీటి బుడగల్లా ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్ళగానే గెలుపు కాదన్నారు. హుజురాబాద్ లో బీజేపీ,టీఆర్ఎస్ కు మాత్రమే పోటీ అన్నారు.