- కేసు నమోదు చేసిన పోలీసులు
చెన్నై: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్పై కేసు నమోదైంది. ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. చెన్నైలో సాంప్రదాయ కళలను బోధించే ప్రతిష్టాత్మక ‘కళాక్షేత్ర ఫౌండేషన్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా హరి పద్మన్ పని చేస్తున్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా దాదాపు 200 మందికి పైగా స్టూడెంట్లు ఆందోళన చేశారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, బాడీ షేమింగ్ చేస్తున్నారని, తిడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీళ్లు గతంలో ఆ ప్రొఫెసర్పై ఫిర్యాదు చేసినా కాలేజీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈ వ్యవహారంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ కూడా స్టూడెంట్లు చేస్తున్నవి నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో సుమారు 90 మంది స్టూడెంట్స్ రాష్ట్ర మహిళా కమిషన్కు శుక్రవారం ఫిర్యాదును అందజేశారు. దీంతో స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్.. తప్పు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డాన్సర్ రుక్మిణి దేవి అరుందలే 1936లో కళాక్షేత్ర ఫౌండేషన్ను స్థాపించారు. భరతనాట్యం, కర్నాటిక్ సంగీతం, ఇతర సాంప్రదాయ కళల కోర్సులను అందించే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. అనేక మంది కళాకారులను అందించింది.