ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. రాధా కిషన్ రావుపై సంధ్యా శ్రీధర్ రావు కంప్లైంట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. రాధా కిషన్ రావుపై సంధ్యా శ్రీధర్ రావు కంప్లైంట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది. భుజంగరావు, తిరుపతన్నను మూడోరోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఇదే కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావును విచారణకు పిలిపించారు. తన ఫోన్ ట్యాప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో గతంలో ఫిర్యాదు చేశారు సంధ్యా శ్రీధర్ రావు.

మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు తమ దగ్గరి నుంచి కోట్ల రూపాయలు తీసుకెళ్లాడని కంప్లైంట్ లో వివరించారు. దీంతో  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  సంధ్యా శ్రీధర్ రావు స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తోంది దర్యాప్తు బృందం. తన అడ్వకేట్ తో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు.