ఎవరో తీసుకున్న రుణం చెల్లించాలని ఫోన్లు, మెసెజ్ లు

ఎవరో తీసుకున్న రుణం చెల్లించాలని ఫోన్లు, మెసెజ్ లు
  • లోన్ తీసుకోకున్న డబ్బులు చెల్లించాలంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు
  • ఫోన్ కాల్స్,  మెసేజ్ లతో వేధిస్తున్నారంటూ ఆందోళన

జగిత్యాల: జగిత్యాలలోని ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలో రాజేశ్ అనే యువకుడు ఆందోళనకు దిగాడు. ఎవరో తీసుకున్న లోన్ కు.. బజాజ్ ఫైనాన్స్ సంస్థ వాళ్లు తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు తీసుకున్న వ్యక్తి.. లోన్ క్లియర్ చేయడంతో గొడవ సద్దుమణిగింది. అయితే తన ప్రమేయం లేకుండా ఇన్ని రోజులు వేధించినందుకు నష్టపరిహారం ఇవ్వాలని యువకుడు డిమాండ్ చేశాడు. బజాజ్ ఫైనాన్స్ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.