
హైదరాబాద్, వెలుగు: టీచర్ల ఫిర్యాదులను త్వరలోనే ‘ఈజీ’ యాప్ ద్వారా తీసుకుని పరిష్కరిస్తామని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. విద్యాశాఖ పరిధిలోని అన్ని డిపార్ట్మెంట్లకు దీన్ని వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా టీచర్లు, లెక్చరర్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, ఫోన్లోనే ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ ఆర్డీలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేనతో కలిసి డీఈఓలతో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమీక్షా నిర్వహించారు. ఎఫ్ఎల్ఎన్,ఉన్నతి, లక్ష్య, బడ్జెట్, మిడ్ డే మీల్స్, పరీక్షలు తదితర అన్ని రకాల అంశాలపై చర్చించారు. సర్కారు బడుల్లో పిల్లల్ని పెంచేలా చూడాలన్నారు.