యాప్ ద్వారా ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తం : విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం 

యాప్ ద్వారా ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తం : విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం 

 హైదరాబాద్, వెలుగు: టీచర్ల ఫిర్యాదులను త్వరలోనే ‘ఈజీ’ యాప్ ద్వారా తీసుకుని పరిష్కరిస్తామని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. విద్యాశాఖ పరిధిలోని అన్ని డిపార్ట్​మెంట్లకు దీన్ని వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా టీచర్లు, లెక్చరర్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, ఫోన్​లోనే ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఎంసీఆర్​హెచ్ ఆర్​డీలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేనతో కలిసి డీఈఓలతో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమీక్షా నిర్వహించారు. ఎఫ్​ఎల్​ఎన్,ఉన్నతి, లక్ష్య, బడ్జెట్, మిడ్ డే మీల్స్, పరీక్షలు తదితర అన్ని రకాల అంశాలపై చర్చించారు. సర్కారు బడుల్లో పిల్లల్ని పెంచేలా చూడాలన్నారు.