కాంగ్రెస్ లో అసంతృప్తులతో నేతల చర్చలు

కాంగ్రెస్ లో అసంతృప్తులతో నేతల చర్చలు

ఠాక్రే, రేవంత్, జానారెడ్డి రంగంలోకి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ సొంత పార్టీలోని అసంతృప్తులపై దృష్టి సారించింది. టికెట్ రాని ఆశావహులతో మాట్లాడి బుజ్జగి స్తున్నది. ఇందులో భాగంగా గురువారం రాత్రి పలు నియోజకవర్గాలకు చెందిన ఆశావహులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బుజ్జగింపుల కమిటీ నేతలు జానారెడ్డి, దీపాదాస్​ మున్షీ, మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు సమావేశమయ్యారు. వారితో మాట్లాడి అసంతృప్తిని చల్లార్చారు. అధికారంలోకి వస్తే కచ్చితంగా పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పరకాల ఆశావహుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వర్ధన్నపేట యాస్పిరెంట్ నమిల్ల శ్రీనివాస్, ఎల్బీ నగర్ టికెట్ ఆశించిన మల్ రెడ్డి రాంరెడ్డి, మిర్యాలగూడ లీడర్ శంకర్ నాయక్, మక్తల్ నేత  ప్రశాంత్ రెడ్డి ఈ మీటింగ్​లో  పాల్గొన్నారు.

ALSO READ : నామినేషన్లకు ముహూర్తం ఎప్పుడుంది.. పండితులను అడుగుతున్న అభ్యర్థులు