ప్రజాందోళనకే మా మద్దతు : సోనియా గాంధీ

ప్రజాందోళనకే మా మద్దతు : సోనియా గాంధీ

పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జనం వాయిస్ వినేందుకు బీజేపీకి ఇష్టంలేదన్నారు సోనియా గాంధీ. ప్రజల హక్కులను కాలరాయడాన్ని ఒప్పుకోబోమన్నారు. బెంగాల్ లో నిరసనలకు పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. ఇక విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ కౌంటరిస్తోంది కేంద్ర

ప్రజల గొంతు వినేందుకు బీజేపీ ఇష్టపడడంలేదని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. అసమ్మతిని కౄరంగా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. తమకు వ్యతిరేకంగా ఉన్న విధానాలపై నిరసన తెలపడం ప్రజలకు ప్రజాస్వామ్య కల్పించిన హక్కు అన్నారు. ప్రజాందోళనలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు సోనియా.