
వికారాబాద్/ ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగే కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం, బహిరంగ సభను జయప్రదం చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్, ముషీరాబాద్ గాంధీనగర్లో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడారు. సమ్మేళనంలో గ్రామ అధ్యక్షులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ పార్టీ ఇన్చార్జి బొంతు రాంమోహన్, సహ ఇన్చార్జిలు సుబ్బారావు, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ముషీరాబాద్ నాయకులు కత్తి పద్మారావు, పాశం అనిల్ కుమార్ యాదవ్, వాజీద్ హుస్సేన్ పాల్గొన్నారు.