- కమీషన్ల కోసమే అంచనాలు పెంచారని కామెంట్
- సోనియా ముందు చెంపలేసుకో కేసీఆర్: రేణుకా చౌదరి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకూ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నదని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ అన్నారు. కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. రాహుల్గాంధీ కాళేశ్వరం(మేడిగడ్డ) పర్యటన తర్వాత అనేక నిజాలు బయటపడుతున్నాయని అశోక్చవాన్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కుటుంబానికి ఏటీఎంలా మారిందన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు అంచనా వ్యయాలను భారీగా పెంచారన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును బీఆర్ఎస్పార్టీ కాళేశ్వరంగా మార్చిందని ఆరోపించారు. కాళేశ్వరం పేరు చెప్పుకుని బీఆర్ఎస్ఓట్లు దండుకుందన్నారు. ఆ ప్రాజెక్ట్పై బీజేపీ ఎన్ని విమ ర్శలు చేసినా.. చర్యలు మాత్రం తీసుకోవడం లేద న్నారు. ప్రాజెక్ట్పై చేసిన ఖర్చంతా తెలంగాణ ప్రజ లపై అప్పుగా మారిందని, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ట్రాక్రికార్డ్కాంగ్రెస్కు ఉందని పేర్కొన్నారు. అంతకుముందు గాంధీభవన్లో కాళేశ్వరం అవినీతి ఏటీఎంను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం అక్రమాలపై రాహుల్ చేసిన కామెంట్లు, మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు.
8 వేల మంది రైతులు చనిపోయారు
కాళేశ్వరం ఫెయిల్యూర్అని కేసీఆర్ఒప్పుకొని సోనియా గాంధీ ముందు చెంపలు వేసుకోవాలని రేణుకా చౌదరి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో బంగారమంతా కేసీఆర్ కుటుంబానికే చేరిం దని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్తో అసైన్డ్భూ ములను దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వ రం ప్రాజెక్ట్ విషయంలో క్వాలిటీ కంట్రోల్ఏమైం దని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటో చెప్పాలన్నారు. పంటకు మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ దన్నారు. కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని, ధరణి పోర్టల్తో సామాన్యుడికి మేలు జరిగిందా అని నిలదీశారు. కేజీ టు పీజీ చదువేదో బీఆర్ఎస్ నేతలు చదువుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.