అవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు

అవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు

శంషాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి దేశ ప్రజలకు వివరించాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‎లో బీజేపీ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు.

 ముఖ్య​అతిథిగా ఆయన హాజరై ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపిన పలువురిని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.