కేసీఆర్ కు కాంగ్రెస్‌ అంటే భయం

కేసీఆర్ కు కాంగ్రెస్‌ అంటే భయం

MIM సభకు,BJP కవాతుకు అనుమతిచ్చిన TRS ప్రభుత్వం తమ ర్యాలీని అడ్డుకోవడం సరికాదన్నారు సీఎల్పీ  నేత మల్లు భట్టి విక్రమార్క. కేసీఆర్ కు.. కాంగ్రెస్‌ భయం పట్టుకుందని… అందుకే తమకు అడ్డు తగులుతున్నారని అన్నారు. ప్రజల్లో కేసీఆర్  వైఖరిని ఎండగతామని  తెలిపారు భట్టి.

శాంతియుతంగా తాము నిర్వహించదలచిన ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి .ఇవాళ కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లో దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు భట్టి విక్రమార్క. ట్రాఫిక్‌ సమస్యల కారణంగా ర్యాలీకీ అనుమతి కుదరదని పోలీసులు తమకు లేఖ రాసారని… అయితే బదులుగా ర్యాలీ ఎక్కడ నిర్వహించాలో మీరే చెప్పాలంటూ పోలీసులకు తాము కూడా లేఖ రాశామని తెలిపారు. అయితే తమ లేఖకు పోలీసులు స్పందించలేదని చెప్పారు. ర్యాలీని ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని, వాయిదా వేసే అవకాశమే లేదని ఆయన అన్నారు. మా వ్యూహాలు మాకున్నాయని తెలిపారు భట్టి.