రైతు కోసం రణం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది : రేవంత్ రెడ్డి

రైతు కోసం రణం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది : రేవంత్ రెడ్డి

ప్రభుత్వ యంత్రాంగం, రైసు మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి అష్ఠకష్టాలు పడుతున్నాడని ఆరోపించారు. రైతుకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడుల చేస్తోందని, ప్రతిదాడులతో కాలక్షేపం చేస్తున్నాయని విమర్శించారు. అందుకే... రైతు కోసం రణం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్ల తేమ, నాణ్యతను పరిశీలించాకే అధికారులు కొనుగోలు చేసి తూకం వేస్తున్నారు. అయినా మిల్లర్లు ధాన్యం దించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు వాపోతున్నట్టు సమాచారం.

ధాన్యం నాణ్యత లేదని కొందరు, తరుగు పేరుతో క్వింటాకు 3 కిలోలు తగ్గిస్తామని మరికొందరు మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. వారి షరతులకు ఒప్పుకుంటేనే వాహనాల నుంచి వడ్ల సంచులు దించుకుంటున్నారని ప్రచారం. ఈ జాప్యం కారణంగా లారీల యజమానులు సైతం రైతుల నుంచి అదనపు కిరాయి వసూలు చేస్తున్నారని సమాచారం.