కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్

యూపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీకు చెందిన నేతలు జోరుగా పార్టీలు మారుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖ పంపారు. ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడటం కాంగ్రెస్ కు గట్టి షాక్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ కు యూపీలో కీలక నేతగా ఉన్నారు. త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.