పీవోకేను స్వాధీనం చేసుకోవడానికికరెక్ట్ టైమ్ ఇదే:కాంగ్రెస్ నేత హరీశ్ రావత్​

పీవోకేను స్వాధీనం చేసుకోవడానికికరెక్ట్ టైమ్ ఇదే:కాంగ్రెస్ నేత హరీశ్ రావత్​

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)పై కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్​ మాజీ సీఎం హరీశ్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే కరెక్ట్  టైమని ఆయన అన్నారు. పాక్ కొత్త ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఇటీవల పీవోకేపై చేసిన కామెంట్లను ఉద్దేశించి హరీశ్ రావత్ సోమవారం స్పందించారు. ప్రస్తుతం పాక్ బలహీనంగా ఉందని, ఆ దేశం నుంచి పీవోకేని స్వాధీనం చేసుకునే సమయం ఇదేనని అన్నారు. "పీవోకేను పాక్​ చెర నుంచి తప్పించడంకాంగ్రెస్ బాధ్యత. దీనిపై మేం అధికారంలో ఉన్నప్పుడే పార్లమెంట్‌‌లో తీర్మానం చేశాం. ప్రస్తుతం మేం అధికారంలో లేనందున.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తన ఎజెండాలో పీవోకేను చేర్చాలి’ అని అన్నారు.