కేసీఆర్.. బతికున్నప్పుడే ఓ మంచి పని చెయ్: అంజన్ కుమార్

కేసీఆర్.. బతికున్నప్పుడే ఓ మంచి పని చెయ్: అంజన్ కుమార్

కేసీఆర్ కు పోయె కాలం వచ్చిందని, బతికి ఉన్నప్పుడే ఓ మంచి పని చేస్తే జనం గుర్తు పెట్టుకుంటారని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ఆర్టీసీ ని ప్రైవేట్ చేస్తే కమిషన్ వస్తదని కేసీఆర్ ఆశపడుతున్నాడని ఆయన అన్నారు.

పక్క రాష్ట్ర సీఎం జగన్ తో అలయ్ బలయ్ చేస్తున్న కేసీఆర్…  ఆర్టీసీని ప్రభుత్వం లో ఎలా విలీనం చేయాలో జగన్ ని  అడిగి తెలుసుకోమని సూచించారు. మంచి మంచోళ్లు పోయారని, బతికి వున్నప్పుడే మంచి పని చేయాలని ఆయన అన్నారు. ఆర్టిసి కార్మికుల డిమాండ్స్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులనుద్దేశించి.. ” మీకు అమ్మవారి దయ వుంది. ఈ మూర్ఖులు ఏమి చేయలేరని, కార్మికులు ధైర్యంగా వుండాలని” అంజన్ కుమార్ అన్నారు.