కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో నలిగిపోతుంది

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో నలిగిపోతుంది

ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క . కోర్టు చెప్పినా కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ లాంటి సీఎం దేశంలో ఎక్కడా లేడన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.  కేసీఆర్ కు అధికారంతో  అహంకారం తలకెక్కిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో నలిగిపోతుందన్నారు.

హైకోర్టు సూచనలతో ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ చర్చలు జరపాలన్నారు.  కేసీఆర్ మారకపోతే రాజ్యాంగ సంక్షోభం గురించి గవర్నర్ కు , రాష్ట్రపతికి విన్నవిస్తామన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాని కూల్చడానికి కుట్రపన్నుతున్నారని   హైకోర్టు కు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అలాంటివి  ఏమయినా ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు. సెల్ఫ్ డిస్మిస్ అని కేసీఆర్ చెప్పడం వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.