హైదరాబాద్, వెలుగు: వడ్లు కొనేందుకు రాష్ట్ర సర్కార్కు చేతకాకపోతే కాంగ్రెస్ పార్టీకి రూ.10 వేల కోట్లు ఇస్తే ప్రతి గింజ మేమే కొంటామని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర సర్కార్ మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుందని చెప్పారు. సోమవారం గాంధీ భవన్లో చిన్నారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్రెడ్డి, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని చిన్నారెడ్డి విమర్శించారు. ఉప్పుడు బియ్యం(బాయిల్డ్ రైస్) జనాలు తినకపోవడం వల్ల అవి వద్దని, సాధారణ బియ్యం(రా రైస్) ఎంత ఇచ్చినా తీసుకుంటామని కేంద్రం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వడ్లు కొనేదాకా రాష్ట్ర సర్కార్పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. అందుకు మండల, జిల్లా ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వడం, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, ఫ్లెక్సీల ఏర్పాటు వంటివి చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. వారం రోజుల్లో వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేయకపోతే కేసీఆర్ ఫామ్హౌస్ను ముట్టడిస్తామని అన్వేష్రెడ్డి హెచ్చరించారు. వరి అంటే ఉరి అని కేసీఆర్ మాట్లాడటం వల్ల రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గిందని అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్లో పండిన వడ్లను ఎవరు కొంటరో వారే రైతుల వడ్లను కూడా కొనాలన్నారు.
పది వేల కోట్లు ఇస్తే ప్రతి గింజ మేమే కొంటం
- తెలంగాణం
- March 22, 2022
లేటెస్ట్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- లారీ బీభత్సం.. బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ
- GT vs DC: ఢిల్లీ ఆల్రౌండ్ ప్రదర్శన.. గుజరాత్పై భారీ విజయం
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- అలా దుష్ప్రచారం చేస్తున్నవారిని చెప్పుతో కొడతా : హరీశ్ రావు
- బైకును ఢీకొన్న నటుడు రఘుబాబు కారు..బీఆర్ఎస్ నాయకుడు మృతి..
- జగన్ పై రాయి దాడి కేసు: బోండా ఉమను టార్గెట్ చేసిన వైసీపీ..
- GT vs DC: పంత్ మెరుపు కీపింగ్.. 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్
- శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- లోకేష్, బాలకృష్ణలకు షాక్.. ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ...
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- గుడ్ న్యూస్ వేడి నుంచి ఉపశమనం : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు...
- KKR vs RR: ఆవేశ్ ఖాన్కే ఇలాంటివి సాధ్యం.. ఒక్క బంతి ఆడకుండానే వైరల్ అయ్యాడుగా
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- హైదరాబాద్లో రాజాసింగ్ ర్యాలీకి.. ఏర్పాట్లు ఇవే
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- ఎర్రబెల్లికి అవమానం.. అందరి ముందు పరువు పోయిందిగా