ఎడ్లబండి నుంచి కిందపడ్డ కాంగ్రెస్ నేత రాజనర్సింహ

ఎడ్లబండి నుంచి కిందపడ్డ కాంగ్రెస్ నేత రాజనర్సింహ

దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచడంపై నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మెదక్ జిల్లాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నాచౌక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమాల్లో ఎడ్లబండ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ మాట్లాడుతుండగా అపశృతి జరిగింది. ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురికావడంతో .. బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో డాక్టర్లు చికిత్స అందించారు.