లక్ష్మీపురంలో మల్లు రమేష్ అంత్యక్రియలు

లక్ష్మీపురంలో మల్లు రమేష్ అంత్యక్రియలు

అనారోగ్యం కారణంగా శనివారం మృతి చెందిన కాంగ్రెస్ నేత మల్లు రమేష్ మృతదేహాన్ని బొంబాయి నుంచి హైదరాబాద్ కు తరలించనున్నారు.  ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ కు తీసుకురానున్నారు. అక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం గంట సమయం పాటు ఉంచి సాయంత్రానికి వైరా మండలం లోని మల్లు రమేష్ సొంత గ్రామమైన స్నానాల లక్ష్మీపురం తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి , సంభాని చంద్రశేఖర్ , పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.