సీఎం పర్యటన.. పొన్నం డిమాండ్లు

సీఎం పర్యటన.. పొన్నం డిమాండ్లు

సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పలు డిమాండ్లు చేశారు. కేసీఆర్ కొండగట్టుకు వచ్చే ముందు బస్సుప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేలా ప్రకటన చేయాలన్నారు. దైవదర్శనం కంటే ముందే బస్సు ప్రమాద బాధితుల సమస్యలు పరిష్కరించాల డిమాండ్ చేశారు. కొండగట్టుకు మెట్లదారి ఏర్పాటు చేయడంతోపాటు గుట్టపై భక్తులకు మిషన్ భగీరథ నీళ్లు అందేలా చూడాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.  కొండగట్టు–వేములవాడతోపాటు కొండగట్టు – ధర్మపురి మధ్య నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలని చెప్పారు. కొండగట్టుపై భక్తులుండేందుకు వీలుగా కాటేజీలు నిర్మించాలన్నారు. వేములవాడకు ఇచ్చిన హామీలాగా కొండగట్టు మిగిలిపోకుండా సీఎం తగిన చర్యలు చేపట్టాలన్నారు.