హైదరాబాద్: ధరణి వల్ల భూ యజమానులు మండల ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్. శనివారం గాంధీభవన్లో కాంగ్రెస్ ధరణి కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని ధరణి బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలినారు. ధరణి వల్ల భూ యజమానులు మండల ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారన్నారని.. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు భూ పరిరక్షణ ఉద్యమం చేస్తామన్నారు. మండల కేంద్రాల్లో ధరణి బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. నివేదక రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని శ్రావణ్ తెలిపారు.